ఫాంపాండ్లో పడి రైతు మృతి
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:01 AM
ఫాంపాండ్లో పడి రైతు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ని నందివడ్డేమాన్లో చోటుచేసుకున్న ది.

బిజినేపల్లి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఫాంపాండ్లో పడి రైతు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ని నందివడ్డేమాన్లో చోటుచేసుకున్న ది. ఆదివారం ఎస్ఐ కే శ్రీనివాస్ తెలి పిన వివరాల మేరకు నంది వడ్డెమా న్ గ్రామానికి చెందిన రైతు బంగార య్య (45) పొలంలో తవ్విన ఫాంపాండ్ ద్వారా పంట సాగు చేశా డు. రోజు మాదిరిగా శనివారం సా యంత్రం పంటకు నీరు పారించేం దుకు వెళ్లాడు. ఫాంపాండ్లో ఏర్పాటు చేసిన మోటారు ఫుట్బాల్కు చెత్త అడ్డు వచ్చి నీళ్లు రాలేదు. తాడు సాయంతో నీటిలోకి దిగి చెత్త తీస్తుండగా తాడు తెగిపోయింది. అత నికి ఈత రాకపోవడంతో నీట ముని గి మృతి చెందాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో భార్య జయమ్మ ఆది వారం ఉదయం బంధువుల తో కలిసి పొలం వద్ద వెతికారు. ఫాంపాండ్ (నీటి గుంత)లో శవమై తేలా డు. ఈ ఘటనపై భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.