ఆలయ నిర్మాణానికి భూమిపూజ
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:16 PM
మక్తల్ పట్టణ సమీపంలోని బీసీ కాలనీలో బుధవారం ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు.

మక్తల్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మక్తల్ పట్టణ సమీపంలోని బీసీ కాలనీలో బుధవారం ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల ముఖ్య నాయకుల సమక్షంలో వేద పండితులు రాఘ వేంద్ర ఆధ్వర్యంలో శా స్త్రోకంగా ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాఘ వేంద్ర మాట్లాడుతూ ఆలయాల నిర్మాణంతోనే ఆధ్యాత్మిక, భక్తిభావం పెరుగుతుందన్నారు. దైవచింతన మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు రాజుల ఆశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, మల్లికార్జున్, మధుసూదన్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, బలరాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, చిన్నహన్మంతు, కాలనీవాసులు పాల్గొన్నారు.