అపూర్వ సమ్మేళనం
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:19 PM
మూసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన 1994-95 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మూడు దశాబ్దాల తర్వాత ఆదివారం సమ్మేళనం అయ్యారు.

మూసాపేట, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : మూసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన 1994-95 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మూడు దశాబ్దాల తర్వాత ఆదివారం సమ్మేళనం అయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకున్న అనుభవాలు, ప్రస్తుత స్థితిగతులు నెమరువేసుకున్నారు. తాము చదువకున్న పాఠశాల అభివృద్ధితో పాటు ఆర్థికంగా వెనకబడిన పేదలకు తమవంతు సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా పేద విద్యార్థులకు చేయూత అందించాలని తీర్మానించారు. సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాలు, రుగ్మతలను రూపుమాఫీ సామాజిక సేవాభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. పూర్వ విద్యార్థులు పేరూర్ రమేష్, సీ.జీ అమర్, ఖాజన్న, జగన్, భీమయ్య, కొండయ్య, శ్రీనివాసులు, మొహియుద్దీన్, ఆవుల శేఖర్, మొక్తదీర్ బాబా, చెన్నారెడ్డి, లింగోజీ, రమేష్రెడ్డి, సమద్, బాలస్వామి పాల్గొన్నారు.