అపూర్వ సమ్మేళనం
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:30 PM
మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.

కోయిలకొండ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో పాఠశాలలో చదువుకొన్న విద్యార్థులు పాఠశాలు చెప్పిన ఉపాద్యాయులను శాలువా, పూలమాలతో సత్కరించారు. 25 సంవత్సరాల తరువాత వివిధ హోదాలో స్థిరపడిన విధ్యార్థులు ఆనాటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు. అనంతరం పాఠశాలకు ఫర్నీచర్ అందించారు. ఆపదలో ఉన్న విద్యార్థులు 17 మందికి ఆర్థిక సాయం అందించారు.