Share News

మల్కపేట రిజర్వాయర్‌కు నీటి విడుదల

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:15 AM

మిడ్‌ మా నేర్‌ నుంచి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటి విడుద లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వెల్లడించారు.

మల్కపేట రిజర్వాయర్‌కు నీటి విడుదల

కోనరావుపేట, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : మిడ్‌ మా నేర్‌ నుంచి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటి విడుద లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వెల్లడించారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్‌, గేట్స్‌, అండర్‌ టన్నెల్‌, పంప్‌హౌస్‌, మోటా ర్లు, కంట్రోల్‌ రూం, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలను ఇంజ నీరింగ్‌ అధికారులతో కలిసి కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేశారు. మల్కపేట రిజర్వా యర్‌లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉందని జిల్లా నీటి పా రుదల శాఖ అధికారి అమ రేందర్‌రెడ్డిని ఆరా తీయగా, మంగళవారం 0.75 టీఎం సీల నీరుందని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలంలోని మిడ్‌ మానేర్‌ నుంచి మంగళవారం 0.5టీఎంసీల నీటి విడు దలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్‌కు చేరుకోగానే.. దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగస ముద్రం చెరువుకు నీటిని తరలిస్తామని వివరించారు. ప్రాజెక్టు పరిధిలో పంటలు వేసిన రైతులు సాగు నీరు విషయమై ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించా రు. ప్రాజెక్టులో నీటి నిలువలు ఉన్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్య లు చేపడుతున్నామని పేర్కొన్నారు. నీటి పారుదల శా ఖ అధికారులు సైతం నిత్యం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటున్నారని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంట ఈఈ కిషోర్‌, డీఈఈలు సత్యనారాయణ, శ్రీని వాస్‌, వినోద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 01:15 AM