విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి..
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:47 AM
రెసిడెన్షియల్ విద్యాల యంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మెనూ పాటిస్తున్నారా? అని విద్యా ర్థులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆరా తీశారు.

గంభీరావుపేట, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : రెసిడెన్షియల్ విద్యాల యంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మెనూ పాటిస్తున్నారా? అని విద్యా ర్థులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆరా తీశారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ బాలి కల విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు పరిశీలించారు. అనం తరం కిచెన్, స్టోర్ రూమ్లో ఆయా ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థినులు రివిజన్ చేస్తుండగా, కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాలయం లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? ఇంకా ఏయే సౌకర్యాలు కావాలి అని అడిగితెలుసుకున్నారు. పలు అంశాలపై ప్రశ్నలు వేసి, సమాధానా లు రాబట్టారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో నిత్యం చదవాలని పిలుపునిచ్చారు. ప్రతి సబ్జెక్టులో వచ్చే సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సృజ న, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.