పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:47 AM
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్మికులు మండల ఇన్చార్జి ఎంపీడీవో ప్రదీప్ కుమార్కు శుక్ర వారం వినపత్రం అందజేశారు.
చందుర్తి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్మికులు మండల ఇన్చార్జి ఎంపీడీవో ప్రదీప్ కుమార్కు శుక్ర వారం వినపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్యాల నర్సయ్య మాట్లా డారు. పంచాయతీ కార్మిక సంఘం నాయ కులు మామిడి నరేష్, వాసం కిరణ్ కుమా ర్, కొమ్ము చరణ్, లక్కీ బాబు, రాములు, మల్యాల లచ్చయ్య,వజ్రవ్వ, గంగజల, లక్ష్మీ, లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.
గంభీరావుపేట : గంభీరావుపేట ఎంపిడీవో రాజేందర్కు గ్రామ పంచాయితీ పారిశుధ్య కార్మికులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని శుక్రవారం అందజే శారు. బకాయి వేతనాలు చెల్లించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
వీర్నపల్లి : మండల పరిషత్ కార్యా లయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికు లు సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రా న్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జీపీవర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్, మండల అధ్యక్షుడు న్యాత నర్సయ్య, మంత్రి వినీత్, శారద, రమేష్, నర్సయ్య, లింగవ్వ, తదిత రులు పాల్గొన్నారు.
ముస్తాబాద్ : మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, లక్ష్మణ్, రాజు తది తరులు పాల్గొన్నారు.