మహాత్మాగాంధీ ఆలోచనా విధానంతో ముందుకు..
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:08 AM
మహాత్మాగాంధీ ఆలోచ నా విధానంతో ముందుకు సాగుదామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్ అన్నారు.

వేములవాడ టౌన్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ ఆలోచ నా విధానంతో ముందుకు సాగుదామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్ అన్నారు. వేములవాడ మండలం చీర్లవంచలో గురువారం మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముంపు గ్రామా ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తున్నానని, గతంలో పెండిం గ్లో ఉన్న 3వేల పైచిలుకు దరఖాస్తులకు శాశ్వత పరిష్కారానికి కృషి చేశామన్నారు. దశాబ్ద కాలంగా వెనుకబడిన వేములవాడను మందుకు తీసుకెళ్లడానిక ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య, చింతపల్లి శ్రీనివాస్రావు, గాలిపెల్లి స్వామి, కత్తి కనుకయ్య తదితరులు ఉన్నారు.