కుష్ఠు అరికట్టేందుకు చర్యలు
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:10 AM
కుష్ఠు వ్యాధిని పూర్తిగా అరికట్టేం దుకు ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటోందని, వ్యాధిని ముందే గుర్తి సే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని డీఎంహెచ్వో డాక్టర్ రజిత, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనిత తెలిపారు.

సిరిసిల్ల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : కుష్ఠు వ్యాధిని పూర్తిగా అరికట్టేం దుకు ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటోందని, వ్యాధిని ముందే గుర్తి సే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని డీఎంహెచ్వో డాక్టర్ రజిత, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనిత తెలిపారు. గురువారం కలెక్టరేట్తో పాటు మండలాలు, గ్రామాల్లో గాంధీజీ వర్ధంతి, కుష్ఠు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి కుష్ఠు వ్యాధి నిర్మూ లనలపై ప్రతిజ్ఞ చేశారు. సిరిసిల్లలో వెంకంపేట పాఠశాలలో కుష్ఠు వ్యాధి పై ప్రత్ఞి చేయించారు. ఈ కార్యక్రమంలో సుందరయ్యనగర్ మెడికల్ అధి కారి డాక్టర్ సాహితి, డీపీఎంవోలు సీహెచ్ శ్రీనివాస్, కే సురేష్, దేవిసింగ్ డిప్యూటీడీఎంవో రాజ్కుమార్, హెచ్ఈ బాలయ్య, సూపర్వైజర్ వాణి తది తరులు పాల్గొన్నారు.