భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:46 AM
మహాశివరాత్రి జాతర సందర్భంగా శైవ క్షేత్రా లకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ ఖుస్రో షాఖాన్ అన్నారు.

భగత్నగర్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి జాతర సందర్భంగా శైవ క్షేత్రా లకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ ఖుస్రో షాఖాన్ అన్నారు. బుధవారం కరీంనగర్ ఆర్టీసీ సమావేశ మందిరంలో జోన్ పరిధిలోని ఆర్ఎంలతో నిర్వహించిన సమీక్షలో మాట్లా డారు. భక్తులకు సరిపడా బస్సులను అందు బాటులో ఉంచాలన్నారు. అనంతరం ఎలక్ట్రిక్ బస్సుల పనితీరుపై సమీక్షించారు. రీజినల్ మేనేజర్లు సోలమన్, సరిరాం, రాజు, విజయ భాను, జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు సత్యనారాయణ, భవాని ప్రసాద్, మాధవరావు, ప్రవీణ్కుమార్, సరస్వతి, ప్రణీత్, భానుకిరణ్, భూపతిరెడ్డి,పవిత్ర, సుగుణాకర్ పాల్గొన్నారు.