జిల్లా పాలనాధికారిని అడ్డం పెట్టుకొని అక్రమ అరెస్టులు, ఇబ్బందులు..
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:09 AM
జిల్లా పాలనాధికారిని అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ నాయకులు అక్రమ అరెస్టులు, ప్రజలను రైతులను ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆరోపించారు.

సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా పాలనాధికారిని అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ నాయకులు అక్రమ అరెస్టులు, ప్రజలను రైతులను ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆరోపించారు. ఆదివారం సిరిసిల్ల పట్టణం ప్రెస్క్లబ్లో విలే కరుల సమావేశంలో ఆగయ్య మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణనపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ప్రజలకు ఇచ్చి న 420 హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షా న పోరాటం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్, రాష్ట్ర కార్యదర్శి గూ డూరి ప్రవీణ్ సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ అడగట్ల మురళి, నాయకులు కుంభాల మల్లారెడ్డి, బండ నర్సయ్య, గుండ్లపెల్లి పూర్ణచందర్ పాల్గొన్నారు.