ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలి..
ABN , Publish Date - Feb 02 , 2025 | 01:03 AM
ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలని, ముదిరాజ్ల చిరకాల కోరికను నెరవేర్చడానికి కృషి చేస్తానని ప్రభు త్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలని, ముదిరాజ్ల చిరకాల కోరికను నెరవేర్చడానికి కృషి చేస్తానని ప్రభు త్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల పట్టణం కళ్యా ణలక్ష్మి గార్డెన్స్లో శనివారం శ్రీ పెద్దమ్మతల్లి ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ సమక్షంలో ఎన్నికల అధికారి కరుణాల భద్రచ లం ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చొ క్కాల రాము, ఉపాధ్యక్షులుగా గొడుగ లక్ష్మినర్సయ్య, శి వంది దేవేందర్, పంబాల దేవరాజు, రేగుల రాజ్కుమా ర్, ప్రధాన కార్యదర్శిగా సారుగు నరేష్, కోశాధికారిగా కంకణాల శేఖర్బాబు, కార్యదర్శులుగా పెరివెల్లి రమే ష్, తునికి నరేష్, గొడుగు శంకర్, రేగుల పర్శరాము లు, సంయుక్త కార్యదర్శిగా జంగపల్లి చంద్రశేఖర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి ఆది శ్రీనివాస్ మాట్లాడారు ముదిరా జ్ కులస్తుల చిరకాల కోరిక బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చడానికి తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. మిడ్మానేరు డ్యాంలో చేపల పెంపకానికి కేజ్క ల్చర్ ద్వారా సబ్సిడీ ఇవ్వడంజరుగుతుందని మత్స కారులు ఈ పథకాన్ని వినియోగించుకో వాలన్నా రు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్రెడ్డి సన్మా నించారు.జిల్లా మత్సపారిశ్రామిక సహకార జిల్లా చైర్మన్ చొప్పారి రామచంద్రం, వైస్చైర్మన్ అంబటి శేఖర్, బీసీ స్టడి సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శహ న్మాండ్లు, ఫిషరీస్ ఫెడరేషన్ మాజీచైర్మన్ పిట్టల రవీం దర్, మాజీ జడ్పిటీసీ కోడి అంతయ్య, టీజేఏసీ రాష్ట్ర నాయకుడు బొజ్జ కనకయ్య, రెడ్డవేణి గోపి, రేగుల మ ల్లిఖార్జున్, దేవుని నర్సయ్య, మల్లయ్య పాల్గొన్నారు.