Share News

ఇంటర్‌ పరీక్షలకు 357 మంది గైర్హాజరు

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:27 AM

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జరిగిన సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షలకు 357 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

ఇంటర్‌ పరీక్షలకు 357 మంది గైర్హాజరు
కరీంనగర్‌ ఆర్ట్‌ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జరిగిన సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షలకు 357 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌, వోకేషనల్‌ విభాగంలో కలిపి 15,639 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా జనరల్‌ విభాగంలో 282 మంది, వొకేషనల్‌లో 75 మంది మొత్తం 357 మంది పరీక్షలకు హాజరుకాలేదు. జనరల్‌ విభాగంలో 14,032 మంది, వొకేషనల్‌లో 1,250 మంది మొత్తం 15,282 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక్కో సెంటర్‌కు ఒక చీప్‌సూపరింటెండెంట్‌, ఒక డిపార్టుమెంటల్‌ అధికారిని నియమించారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, కాపీయింగ్‌ జరుగకుండా ఉండేందుకు ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్వ్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశామని పరీక్షల కన్వీనర్‌, డీఐఈవో తెలిపారు. ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలు పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశాయని, ఎక్కడ కూడా కాపీయింగ్‌ జరుగలేదని చెప్పారు.

Updated Date - Mar 07 , 2025 | 12:27 AM