పంచాయతీరాజ్ సీఈపై దర్యాప్తు చేయండి
ABN , Publish Date - Jun 27 , 2025 | 05:18 AM
పంచాయతీ రాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ విభాగం చీఫ్ ఇంజినీర్ వై.రామకృష్ణ విషయంలో వచ్చిన ఫిర్యాదుపై..
డైరెక్టర్కు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఆదేశం
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ రాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ విభాగం చీఫ్ ఇంజినీర్ వై.రామకృష్ణ విషయంలో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టి వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్.. డైరెక్టర్ సృజనకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు గురువారం సర్క్యులర్ జారీ చేశారు.
పని ప్రదేశంలో రామకృష్ణ వేధిస్తున్నాడని, ఇబ్బందులకు గురిచేస్తున్నాడని పలువురు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంలో ప్రాథమిక దర్యాప్తు జరిపి వారంలోగా నివేదిక ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.