ED Raids: భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:17 AM
భూదాన్ భూముల కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 45 వింటేజ్ కార్లు, రూ.23 లక్షల నగదు, 12వేల దిర్హాంలు స్వాధీనం
45 వింటేజ్ కార్లు, 23 లక్షల నగదు, 12వేల దిర్హాంలు స్వాధీనం
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): భూదాన్ భూముల్లో పెద్దఎత్తున గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ఈడీ సేకరించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోలోని ఐదుగురు నిందితుల ఇళ్లు, ఫార్మ్హౌస్ల్లో సోమవారం జరిపిన సోదాల్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ రీజియన్ ఈడీ అధికారులు మంగళవారం తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ మునావర్ ఖాన్, ఖదీరున్నీసా, మహ్మద్ లతీఫ్ షర్ఫాన్, మహ్మద్ షుకూర్, మహ్మద్ అక్తర్ షర్ఫాన్ ఇళ్లు, ఫార్మ్హౌ్సల్లో సోదాలు జరిపారు. ఫోర్జరీ ల్యాండ్ డాక్యుమెంట్లు, రూ.23 లక్షల నగదు, 45వింటేజ్కార్లు, యూఏఈకి చెందిన 12వేల దిర్హాంలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
Maryam: భారత్లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
For Telangana News And Telugu News