EAGLE Operation: కట్టలుకట్టలుగా డబ్బు స్వాధీనం.. ఈగల్ ఆపరేషన్ సక్సెస్
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:05 PM
డ్రగ్ మనీ లాండరింగ్ కింగ్పిన్ దర్గారం ప్రజాపతిని ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో రూ.3 కోట్ల హవాలా డబ్బును ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. నైజీరియా డ్రగ్ కార్టెల్కు డబ్బు సరఫరా చేసిన నెట్వర్క్ ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం (ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) మరో భారీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించింది. డ్రగ్ మనీ లాండరింగ్ చేస్తున్న కింగ్పిన్ దర్గారం ప్రజాపతిని ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో రూ.3 కోట్ల హవాలా డబ్బును ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. నైజీరియా డ్రగ్ కార్టెల్కు డబ్బు సరఫరా చేసిన నెట్వర్క్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేశారు. నకిలీ పాస్పోర్ట్లతో విదేశీయులు భారత్లోకి వస్తున్నట్లు ఈగల్ పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Maria Corina Machado Wins Nobel Peace Prize: మరియా కొరినాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
CM Chandrababu Naidu: విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం..