Aadi Srinivas: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - May 18 , 2025 | 04:39 AM
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన 57 సమస్యల్లో 45కు పైగా తక్షణమే పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. 15 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న టీచర్ల బదిలీ లు పూర్తి చేసి పదోన్నతులిచ్చినట్లు చెప్పారు.
సీఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతినెల మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంవచ్చాక ఒక డీఏ ఇచ్చినట్టు తెలిపారు.