Coding Courses: గురుకులాల్లో కోడింగ్ కోర్సులు
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:12 AM
గురుకులాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కోడింగ్ కోర్సులను విద్యార్థులకు అందించబోతున్నట్లు టీజీ ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి అలగు వర్షిణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు
హైదరాబాద్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): గురుకులాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కోడింగ్ కోర్సులను విద్యార్థులకు అందించబోతున్నట్లు టీజీ ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి అలగు వర్షిణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయబోతున్నట్లు ఆమె వివరించారు.
ఇందుకు సంబంధించి ఆర్పీఎఫ్, యూకే ఫౌండేషన్తో ఎంవోయూ చేసుకున్నట్లు తెలిపారు. 2025- 26 విద్యా సంవత్సరం నుంచి 238 గురుకులాల్లో ఈ శిక్షణ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. క్రితం ఏడాది కేవలం మొయినాబాద్ పాఠశాలలో మాత్రమే కోడింగ్ శిక్షణ ఉండేదని, ప్రస్తుతం దీనిని రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో విస్తరింపజేయబోతున్నామని వివరించారు.