Bhatti Vikramarka: ట్రాన్స్కోలో 19 మందికి కారుణ్య నియామకాలు
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:25 AM
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమమే ప్రజా ప్రభుత్వ విధానమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజా భవన్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ట్రాన్స్కోలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలను ఆయన అందజేశారు.
నియామక పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమమే ప్రజా ప్రభుత్వ విధానమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజా భవన్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ట్రాన్స్కోలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలను ఆయన అందజేశారు. వీరిలో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు, 11 మంది ఆర్టిజన్లుగా నియమితులయ్యారు. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు ఆర్టిజన్లను సమానంగా చూస్తున్నట్లు డిప్యూటీ సీఎం విక్రమార్క చెప్పారు. కారుణ్య నియామక ఉత్తర్వులు అందుకున్న వారంతా సంస్థ అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు.
డీఎ్ససీ-2024 ఉద్యోగుల వేతనాలకు లైన్క్లియర్
డీఎ్ససీ-2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించడానికి ఆర్థిక శాఖ సుముఖత వ్యక్తం చేసింది. వారి సర్వీసును 2024 అక్టోబర్ 10 నుంచి లెక్కిస్తూ వేతనం చెల్లించడానికి అనుమతించిన ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా.. అందుకు తగు చర్యలు తీసుకోవాలని ట్రెజరీ అధికారులను దిశా నిర్దేశం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై గత ఎనిమిది నెలలుగా పాఠశాల విద్యా సంచాలకుల నుంచి ఉప ముఖ్యమంత్రి వరకూ నిరంతరం కలిసి విజ్ఞప్తులు చేశామన్న యూటీఎఫ్.. వేతనాల చెల్లింపునకు ఉత్తర్వులు వెలువడినందుకు హర్షం వ్యక్తం చేసింది.