Bhatti Vikramarka: యుద్ధ వాతావరణం.. సమగ్ర ప్రణాళిక అవసరం
ABN , Publish Date - May 10 , 2025 | 05:07 AM
యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉత్పన్నమయ్యే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసు అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.

ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, మే 9 (ఆంధ్రజ్యోతి): యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉత్పన్నమయ్యే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసు అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. సచివాలయంలో ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొందించడానికి అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని వర్గాల వారితో సంఘీభావ ర్యాలీలను నిర్వహించాలని చెప్పారు.
ప్రజలను అప్రమత్తం చేసేలా మాక్ డ్రిల్స్ను నిర్వహించాలని అధికారులకు సూచించారు. అత్యవసర విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దు చేసి, వారు హెడ్క్వార్టర్లలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించామని చెప్పారు.
Deputy CM Bhatti Vikramarka, Police Action Plan, Emergency Situation, Mock Drills, Civil Defense, Telangana Government, Nationalism, Public Awareness, District Rallies, Government Response