Admissions: 5 నుంచి మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ
ABN , Publish Date - May 03 , 2025 | 05:50 AM
దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ కం రిజర్వేషన్ ఆధారిత ఎంపికైన విద్యార్థుల జాబితాను 26వ తేదీన ప్రదర్శిస్తారు.
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులో చేరడానికి ఐదో తేదీ నుంచి 20వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మోడల్ స్కూళ్ల అదనపు డైరెక్టర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ కం రిజర్వేషన్ ఆధారిత ఎంపికైన విద్యార్థుల జాబితాను 26వ తేదీన ప్రదర్శిస్తారు. 27 -31 తేదీల మధ్య అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. జూన్ రెండో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.