Share News

Youtube: గత 3 ఏళ్లల్లో భారతీయులకు రూ.21 వేల కోట్లు చెల్లించిన యూట్యూబ్

ABN , Publish Date - May 02 , 2025 | 06:17 PM

కంటెంట్ క్రియేటర్ల అభివృద్ధి కోసం వచ్చే రెండేళ్లల్లో భారత్‌లో రూ.850 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ సీఈఓ తాజాగా తెలిపారు. గత మూడేళ్లల్లో భారతీయ కంటెంట్ క్రియేటర్లకు రూ.21 వేల కోట్లు చెల్లించినట్లు తెలిపారు.

Youtube: గత 3 ఏళ్లల్లో భారతీయులకు రూ.21 వేల కోట్లు చెల్లించిన యూట్యూబ్
YouTube funding for artists

ఇంటర్నెట్ డెస్క్: కంటెంట్ క్రియేటర్లు, ఆర్టిస్టులు, మీడియా కంపెనీల అభివృద్ధి కోసం భారత్‌లో రూ.850 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ సీఈసీ నీల్ మోహన్ గురువారం తెలిపారు. భారతీయుల కంటెంట్‌ను గతేడాది విదేశీయులు 45 బిలియన్ గంటల పాటు వీక్షించారని తెలిపారు. ఇక గత మూడేళ్లల్లో యూట్యూబ్ భారత కంటెంట్ క్రియేటర్లు, ఆర్టిస్టులు, మీడియా కంపెనీలకు రూ.21 వేల కోట్లు చెల్లించిందని కూడా తెలిపారు. భారత దేశ ప్రత్యేకతకు కంటెంట్ క్రియేటర్లు ఉదాహరణగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. భారత దేశ చరిత్ర, సంస్కృతి వంటి అంశాలను ఎంతో అనురక్తితో ప్రపంచంతో పంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.


ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్లకు మార్గదర్శిగా నిలుస్తోందని అన్నారు. ప్రపంచంలో అత్యధిక యూట్యూబ్ ఫాలోవర్లు ఉన్న ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారని కూడా అన్నారు. భారత్‌ను క్రియేటర్ నేషన్‌గా ఆయన అభివర్ణించారు. భారత్‌లో దాదాపు 100 మిలియన్ ఛానల్స్ గతేడాది యూట్యూబ్ వీడియోలు అప్‌లోడ్ చేశాయని అన్నారు. వీటిల్లో సుమారు 15 వేల పైచిలుకు ఛానల్స్‌కు ఒక మిలియన్‌కు మించిన సబ్‌స్క్రైబర్లు ఉన్నారని తెలిపారు. ‘‘మిలియన్ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్స్ సంఖ్య కొద్ది నెలల క్రితం కేవలం 11 వేలుగా ఉండేది. ఇప్పుడు 15 వేలు దాటిపోయింది’’ అని చెప్పారు


యూట్యూబ్ సాయంతో వీరంతా తమ అభిరుచిని ప్రపంచంతో షేర్ చేయడంతో పాటు మంచి వ్యాపారాలను కూడా నిర్మించగలిగారని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఎక్కడెక్కడి కంటెంట్ క్రియేటర్లు, వ్యూవర్స్‌ను కలిపే అద్భుత సామర్థ్యం యూట్యూబ్ సొంతమని తెలిపారు. సాంస్కృతిక విలువల ఎగుమతికి యూట్యూబ్ ఓ సృజనాత్మక సాధనమని అన్నారు. ఇక ప్రపంచంలోని టాప్ 100 యూట్యూబ్ ఛానళ్లల్లో అనేకం భారత్‌కు చెందినవే. టీసిరీస్, ఎస్ఈటీ ఇండియా, జీ మ్యూజిక్ కంపెనీ, సోనీ సాబ్ వంటివి నిత్యం ముందు వరుసలో నిలుస్తున్నాయి. టీసిరీస్‌కు 292 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. భారతీయ యూట్యూబ్ ఛానల్స్‌లో ప్రస్తుతం ఇదే టాప్.

ఇవి కూడా చదవండి:

యూట్యూబ్ పుట్టి 20 ఏళ్లు.. ఇప్పటివరకూ ఎన్ని వీడియోలు అప్‌లోడ్ అయ్యాయంటే..

యూపీఐని మించిన టెక్నాలజీ.. చైనా రూటే సపరేటు

జపాన్‌లో మరో అద్భుతం.. ఆరు గంటల వ్యవధిలో రైల్వే స్టేషన్ నిర్మాణం

Read Latest and Technology News

Updated Date - May 02 , 2025 | 06:20 PM