Share News

Pro Kabaddi League: యు ముంబా చేతిలో బుల్స్‌ చిత్తు

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:54 AM

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో భాగంగా ఇక్కడ జరిగిన పోరులో యు ముంబా ఘనవిజయం సాధించింది. శుక్రవారం నాటి తొలి మ్యాచ్‌లో యు ముంబా 48-28తో బెంగళూరు బుల్స్‌ను చిత్తుచేసింది...

Pro Kabaddi League: యు ముంబా చేతిలో బుల్స్‌ చిత్తు

విశాఖపట్నం-స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో భాగంగా ఇక్కడ జరిగిన పోరులో యు ముంబా ఘనవిజయం సాధించింది. శుక్రవారం నాటి తొలి మ్యాచ్‌లో యు ముంబా 48-28తో బెంగళూరు బుల్స్‌ను చిత్తుచేసింది. ఈ సీజన్‌లో బెంగళూరుకిది వరుసగా మూడో ఓటమి. మ్యాచ్‌ ప్రారంభం నుంచే యు ముంబా ఆటగాళ్లు రైడింగ్‌, టాకిలింగ్‌లో వరుస పాయింట్లతో దూసుకెళ్లారు. ప్రథమార్ధంలో ముంబా రైడర్‌ అజిత్‌ చౌహాన్‌ అద్భుతమైన రైడ్‌లో ఒకేసారి ఆరు పాయింట్లు రాబట్టాడు. ఈ సీజన్‌లో ఒక రైడ్‌లో అత్యధిక పాయింట్లు రాబట్టిన రైడర్‌గా అజిత్‌ రికార్డు నెలకొల్పాడు. అజిత్‌ మొత్తంగా 13 పాయింట్లు సాధించాడు. ప్రథమార్ధాన్ని 29-12తో ముగించిన ముంబా.. ద్వితీయార్ధంలోనూ జోరు కొనసాగించింది. చివర్లో ముంబాను ఆలౌట్‌ చేసే అవకాశాలొచ్చినా బుల్స్‌ సద్వినియోగం చేసుకోలేకపోయింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 37-32తో యూపీ యోధాస్‌పై గెలుపొందింది.

ఇవి కూడా చదవండి..

ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారణ..

కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 06 , 2025 | 03:54 AM