ఫైనల్కు శ్రీకాంత్
ABN , Publish Date - May 25 , 2025 | 05:19 AM
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అప్పుడెప్పుడో 2019లో ఇండియా ఓపెన్లో రన్నర్పగా నిలిచిన తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆరేళ్ల తర్వాత ఓ బీడబ్ల్యూఎఫ్ టూర్ ఈవెంట్లో...
మలేసియా మాస్టర్స్
కౌలాలంపూర్: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అప్పుడెప్పుడో 2019లో ఇండియా ఓపెన్లో రన్నర్పగా నిలిచిన తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆరేళ్ల తర్వాత ఓ బీడబ్ల్యూఎఫ్ టూర్ ఈవెంట్లో ఫైనల్కు చేరాడు. ఫామ్లేమికి చెక్ పెడుతూ, తన జోరు కొనసాగిస్తూ కిడాంబి.. మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టైటిల్ఫైట్కు దూసుకెళ్లాడు. శనివారం ఇక్కడ జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో 32 ఏళ్ల శ్రీకాంత్ 21-18, 24-22తో జపాన్కు చెందిన యుషి తనకను ఓడించాడు. ఆదివారం జరిగే తుదిపోరులో చైనా షట్లర్ లి షి ఫెంగ్తో శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
ఇవీ చదవండి:
టీమిండియాలోకి ట్రక్ డ్రైవర్ కొడుకు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి