China Open 2025: మెరుగైన ప్రదర్శనపైనే సాత్విక్ జోడీ దృష్టి
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:37 AM
వరల్డ్ చాంపియన్షి్ప్స నేపథ్యంలో.. భారత డబుల్స్ టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలనుకొంటోంది...
బరిలో సింధు, ప్రణయ్, లక్ష్య సేన్
చైనా ఓపెన్ నేటి నుంచి
చాంగ్జౌ: వరల్డ్ చాంపియన్షి్ప్స నేపథ్యంలో.. భారత డబుల్స్ టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలనుకొంటోంది. మంగళవారం నుంచి జరిగే చైనా ఓపెన్లో మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పారి్సలో వచ్చే నెల 25 నుంచి జరిగే వరల్డ్ చాంపియన్షి్ప ముందు ఇదే మేజర్ ఈవెంట్. ఈ సీజన్లో సాత్విక్ జోడీ మూడు టోర్నీల్లో సెమీ్సకు చేరుకొంది. అయితే, సాత్విక్ అనారోగ్యం ఆందోళన కలిగిస్తుండగా.. చిరాగ్ కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. సింగిల్స్లో లక్ష్య సేన్, హెచ్ఎ్స ప్రణయ్, పీవీ సింధు, ఉన్నతి హుడా బరిలో నిలవనున్నారు. డబుల్స్లో కవిప్రియ-సిమ్రన్, రుతుపర్ణ-శ్వేతపర్ణ, అమృత-సోనాలి, రుత్విక శివాని-రోహన్ కపూర్ జంటలు ఆడనున్నాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి