Share News

Badminton: సింధు తొలి రౌండ్లోనే..

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:16 AM

భారత స్టార్‌ పీవీ సింధు జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఆరంభ రౌండ్లోనే పరాజయం పాలైంది. కొరియా షట్లర్‌ సిమ్‌ యు జిన్‌తో బుధవారం జరిగిన పోరులో మాజీ ప్రపంచ చాంపియన్‌ సింధు...

Badminton: సింధు తొలి రౌండ్లోనే..

  • జపాన్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ పరాజయం

  • సాత్విక్‌ జోడీ, లక్ష్య, అనుపమ ముందంజ

టోక్యో: భారత స్టార్‌ పీవీ సింధు జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఆరంభ రౌండ్లోనే పరాజయం పాలైంది. కొరియా షట్లర్‌ సిమ్‌ యు జిన్‌తో బుధవారం జరిగిన పోరులో మాజీ ప్రపంచ చాంపియన్‌ సింధు 15-21, 14-21తో చిత్తయింది. ఇలా.. తొలి రౌండ్లోనే ఓడడం ఈ ఏడాదిలో సింధుకిది ఐదోసారి కావడం గమనార్హం. మిగతా భారత అమ్మాయిల్లో అనుపమ ఉపాధ్యాయ 21-15, 18-21, 21-18తో సహచర షట్లర్‌ రక్షితపై నెగ్గగా, ఉన్నతి హుడా 8-21, 12-21తో పోర్న్‌ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ 21-11, 21-18తో వాంగ్‌ జెంగ్‌ (చైనా)ను ఓడించి రెండో రౌండ్‌ చేరాడు. డబుల్స్‌లో ప్రపంచ 15వ ర్యాంక్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి 21-18, 21-10తో కొరియా జంట కాంగ్‌ మిన్‌/కిమ్‌ డోంగ్‌ను చిత్తుచేసి టోర్నీలో శుభారంభం చేసింది. డబుల్స్‌లో హరిహరణ్‌/రూబన్‌ కుమార్‌ జోడీ, మహిళల డబుల్స్‌లో కవిప్రియ/సిమ్రన్‌ ద్వయం ప్రత్యర్థుల చేతిలో ఓడి ఆదిలోనే ఇంటిబాట పట్టారు.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 04:16 AM