Budapest Wrestling: ప్రియకు రజతం
ABN , Publish Date - Jul 20 , 2025 | 05:15 AM
భారత మహిళా రెజ్లర్లు ప్రియ, మనీషా.. హంగేరీ రాజధాని బుడాపె్స్టలో జరుగుతున్న ర్యాంకింగ్ సిరీ్సలో పతకాలు కొల్లగొట్టారు. శనివారం జరిగిన 76 కిలోల...
బుడాపెస్ట్ రెజ్లింగ్లో మనీషాకు కాంస్యం
న్యూఢిల్లీ: భారత మహిళా రెజ్లర్లు ప్రియ, మనీషా.. హంగేరీ రాజధాని బుడాపె్స్టలో జరుగుతున్న ర్యాంకింగ్ సిరీ్సలో పతకాలు కొల్లగొట్టారు. శనివారం జరిగిన 76 కిలోల విభాగంలో ప్రియ రజతం సాధించగా.. 62 కిలోల కేటగిరిలో మనీషా కాంస్య పతకం దక్కించుకొంది. ఫైనల్లో ప్రియ 3-4తో బ్రెజిల్ రెజ్లర్ తమిరెస్ మార్టిన్స్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఇక, కాంస్యం పోరులో క్రిస్టీనాను మనీషా చిత్తుచేసి పతకం అందుకుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి