Share News

Track And Field: బ్రస్సెల్స్‌ ఈవెంట్‌కు నీరజ్‌ చోప్రా దూరం

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:53 AM

ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ (డీఎల్‌) ఫైనల్స్‌కు ఇప్పటికే అర్హత సాధించిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. డీఎల్‌ తుది అంచె బ్రస్సెల్స్‌ ఈవెంట్‌కు దూరమయ్యాడు...

 Track And Field: బ్రస్సెల్స్‌ ఈవెంట్‌కు నీరజ్‌ చోప్రా దూరం

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ (డీఎల్‌) ఫైనల్స్‌కు ఇప్పటికే అర్హత సాధించిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. డీఎల్‌ తుది అంచె బ్రస్సెల్స్‌ ఈవెంట్‌కు దూరమయ్యాడు. డైమండ్‌ లీగ్‌లో భాగంగా మొత్తం నాలుగు అంచెల్లో పోటీలు జరుగుతాయి. ఇప్పటికే మూడు ముగిశాయి. ఆఖరిదైన బ్రస్సెల్స్‌ టోర్నమెంట్‌ శుక్రవారం బెల్జియంలో జరగనుంది. ఇక.. డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ ఈనెల 28న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో జరగనుంది.

ఇవి కూడా చదవండి..

Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం

India Women Cricket: ప్రపంచకప్‌ జట్టులో శ్రీచరణి

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2025 | 03:53 AM