World Archery Championship 202: పతకంపై జ్యోతి దీపిక గురి
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:45 AM
ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న భారత స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖతో పాటు వెటరన్ దీపికా కుమారి శనివారం నుంచి జరిగే వరల్డ్ ఆర్చరీ చాంపియన్షి్పలో పతకమే లక్ష్యంగా...
నేటి నుంచి వరల్డ్ ఆర్చరీ
గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న భారత స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖతో పాటు వెటరన్ దీపికా కుమారి శనివారం నుంచి జరిగే వరల్డ్ ఆర్చరీ చాంపియన్షి్పలో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో భారత్ తరఫున పురుషులు, మహిళలు కలిపి 12 మంది ఆర్చర్లు పాల్గొంటున్నారు. జ్యోతి, పర్ణీత్, ప్రీతికలతో కూడిన మహిళల టీమ్పై ఈసారి కూడా భారీ అంచనాలున్నాయి. ఇక పురుషుల కాంపౌండ్లో ప్రథమేశ్, అమన్ సైనీ, రిషభ్ యాదవ్ ఈ ఏడాది అద్భుత ఫామ్లో ఉన్నారు. అయితే మహిళల రికర్వ్లో దీపిక, అంకిత, గథ ఖడకే సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. శనివారం తొలి రోజు కాంపౌండ్ పోటీలు జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్లో టెస్ట్కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..