Share News

ECB Extends Offer to BCCI: ఐపీఎల్-2025 ఇంగ్లండ్‌లో జరగనుందా?

ABN , Publish Date - May 09 , 2025 | 10:29 PM

భారత్‌తో త్వరలో టెస్ట్ సిరీస్ ఇంగ్లండ్‌తో జరగనున్న దృష్ట్యా మిగిలిన ఐపీఎల్ మ్యాచులను కూడా ఇంగ్లండ్‌లో జరపాలని, ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు బీసీసీఐకి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

ECB Extends Offer to BCCI: ఐపీఎల్-2025 ఇంగ్లండ్‌లో జరగనుందా?
IPL 2025 England

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని బీసీసీఐ వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఓ కొత్త ప్రతిపాదనను బీసీసీఐ ముందుంచినట్టు తెలుస్తోంది. ఈ టోర్నీలో తదుపరి మ్యాచులకు ఇంగ్లండ్‌లో ఆతిథ్యమించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు ఓ బ్రిటన్ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌లో వెలువడిన కథనం ఆసక్తి రేపుతోంది.

పాక్‌తో ఉద్రికత్తల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్‌కు తాత్కాలిక విరామం ప్రకటించింది. విదేశీ ప్లేయర్లను తమ సొంత దేశాలకు సురక్షితంగా చేర్చేందుకు ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను ఇంగ్లండ్‌లో కొనసాగించాలని మొదట మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ మైఖేల్ వాన్ ప్రతిపాదించారు. ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తదుపరి భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు కూడా ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను అక్కడే నిర్వహించడం భారత్‌కు ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ ముందు ఇదే ప్రతిపాదన చేసినట్టు వార్తలు రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తొలుత పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మే 8న జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. ఆ వెంటనే మైఖేల్ వాన్ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ‘‘ఐపీఎల్‌ మిగతా మ్యాచ్‌లను ఇంగ్లండ్‌లో కొనసాగిస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన వస్తోంది. ఇక్కడ అన్ని స్టేడియమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆ తరువాత టీమిండియా కూడా ఇక్కడే టెస్ట్ సరీస్ కూడా ఆడొచ్చు’’ అని అన్నాడు. జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ప్రస్తుత పరిస్థితిల్లో ఐపీఎల్‌ను మరికొంత కాలం పాటు వాయిదా వేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇక పాక్ క్రికెట్ బోర్డు కూడా తన పీఎస్ఎల్ టోర్నీని దుబాయ్‌లో కొనసాగించాలని భావిస్తున్నా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఇందుకు సుముఖంగా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

పాక్ క్రికెట్ బోర్డుకు షాక్.. పీఎస్‌ఎల్ టోర్నీకి నో చెప్పేందుకు రెడీ అయిన యూఏఈ

దూకుడు పెంచిన పాక్.. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు

భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..

మరిన్ని క్రీడ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 09 , 2025 | 10:41 PM