Share News

నాలుగు దేశాల టోర్నీలో భారత్‌కు మూడో స్థానం

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:49 AM

నాలుగు దేశాల జూనియర్‌ హాకీ టోర్నీలో భారత జట్టు 2-1తో ఆస్ట్రేలియాను ఓడించింది. బుధవారం మూడో స్థానం...

నాలుగు దేశాల టోర్నీలో భారత్‌కు మూడో స్థానం

బెర్లిన్‌: నాలుగు దేశాల జూనియర్‌ హాకీ టోర్నీలో భారత జట్టు 2-1తో ఆస్ట్రేలియాను ఓడించింది. బుధవారం మూడో స్థానం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ తరపున రోహిత్‌ (45వ నిమిషంలో), అజీత్‌ యాదవ్‌ (52వ ని.) రెండు గోల్స్‌ చేశారు. ఆట 40వ నిమిషం వరకు ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయాయి. ఈ సమయంలో ఆట 43వ నిమిషంలో ఆసీస్‌ కెప్టెన్‌ టోబి మల్లోన్‌ తొలి గోల్‌ కొట్టి, ఆ జట్టును ఆధిక్యంలో నిలిపాడు.

ఇవీ చదవండి:

1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్

ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 05:49 AM