India U19 vs Australia U19: భారత కుర్రాళ్ల క్లీన్స్వీ్ప
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:42 AM
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అండర్-19 కుర్రాళ్లు అదరగొడుతున్నారు. శుక్రవారం జరిగిన మూడో యూత్ వన్డేలో భారత్ ఏకంగా 167 పరుగులతో...
మూడో వన్డేలోనూ ఆసీస్ చిత్తు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అండర్-19 కుర్రాళ్లు అదరగొడుతున్నారు. శుక్రవారం జరిగిన మూడో యూత్ వన్డేలో భారత్ ఏకంగా 167 పరుగులతో గెలిచింది. దీంతో ఆసీస్ అండర్-19 జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీ్సను ఆయుష్ మాత్రే బృందం 3-0తో క్లీన్స్వీ్ప చేసింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులు చేసింది. వేదాంత్ (86), రాహుల్ (62), విహాన్ (40) రాణించారు. ఛేదనలో ఆసీస్ అండర్-19 జట్టు 28.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఖిలాన్ పటేల్కు 4, ఉధవ్కు 3, కని్ష్కకు 2 వికెట్లు లభించాయి.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News