నిరాశపరచిన షట్లర్లు
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:40 AM
ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో గాయత్రీ గోపీచంద్ జోడీ మినహా భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ టాప్-10లో చోటు కోల్పోయారు....

బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో గాయత్రీ గోపీచంద్ జోడీ మినహా భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ టాప్-10లో చోటు కోల్పోయారు. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో లక్ష్యసేన్ ఐదు స్థానాలు దిగజారి 15వ ర్యాంక్కు, ప్రణయ్ 29వ ర్యాంక్కు పడిపోయారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు 15 నుంచి 16వ ర్యాంక్కు దిగొచ్చింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి 2021 తర్వాత తొలిసారి టాప్- 10లో స్థానం కోల్పోయి 7 నుంచి 12వ ర్యాంక్కు చేరుకుంది. మహిళల డబుల్స్లో గాయత్రి-ట్రీసా జంట నిలకడగా తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల జోడీ కెరీర్లో తొలిసారిగా 20వ ర్యాంక్ సాధించి, టాప్-20లోకి ప్రవేశించింది.
ఇవీ చదవండి:
అంత ఈజీనా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్
ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి