Share News

Pro Kabaddi League: బుల్స్‌ బోణీ

ABN , Publish Date - Sep 07 , 2025 | 04:54 AM

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో బెంగళూరు బుల్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు ఓటముల అనంతరం తొలి విజయాన్ని నమోదు చేసింది...

Pro Kabaddi League: బుల్స్‌ బోణీ

ప్రొ కబడ్డీ లీగ్‌లో పైరేట్స్‌ చిత్తు

విశాఖపట్నం-స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో బెంగళూరు బుల్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు ఓటముల అనంతరం తొలి విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 38-30తో పట్నా పైరేట్స్‌ను చిత్తుచేసింది. బుల్స్‌ రైడర్‌ అలిరెజా మీర్జాయిన్‌ అద్భుతంగా రాణించి సూపర్‌ 10 సాధించగా.. మరో రైడర్‌ ఆశిష్‌ మాలిక్‌ 8 పాయింట్లు రాబట్టి బుల్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. పైరేట్స్‌లో అయాన్‌ సూపర్‌ 10 సాధించినా ఫలితం లేకపోయింది. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 37-28తో తమిళ్‌ తలైవా్‌సపై విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి..

ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారణ..

కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2025 | 04:54 AM