ఒలింపిక్ చాంపియన్కు ఆర్య జోడీ షాక్
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:51 AM
ఒలింపిక్ చాంపియన్కు షాకిచ్చిన భారత షూటింగ్ జోడీ ఆర్య బోర్స్-అర్జున్ బబుతా స్వర్ణాన్ని కైవసం చేసుకొంది. ఐఎ్సఎ్సఎఫ్ వరల్డ్కప్లో శనివారం...
వరల్డ్కప్లో స్వర్ణం కైవసం
మ్యూనిచ్: ఒలింపిక్ చాంపియన్కు షాకిచ్చిన భారత షూటింగ్ జోడీ ఆర్య బోర్స్-అర్జున్ బబుతా స్వర్ణాన్ని కైవసం చేసుకొంది. ఐఎ్సఎ్సఎఫ్ వరల్డ్కప్లో శనివారం జరిగిన 10 మీ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్ స్వర్ణ పోరులో ఆర్య-అర్జున్ జంట 17-7తో చైనాకు చెందిన వరల్డ్ చాంపియన్ ద్వయం జిఫీ వాంగ్-లిహావో షెంగ్ను చిత్తు చేసింది. క్వాలిఫికేషన్ రౌండ్లో అర్జున్ (317.7 పాయింట్లు), ఆర్య (317.5)లు మొత్తం 635.2 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా.. షెంగ్-వాంగ్ జంట 635.9 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News