రైల్లో అధిక ధరకు నీళ్ల బాటిల్ కొంటున్నారా? అయితే..
ABN, Publish Date - Jan 24 , 2025 | 04:38 PM
రైల్లో ఎక్కువ ధరకు నీళ్ల బాటిల్ కొంటున్నారా? అధిక ధర అని తెలిసీ ఏం చేయలేక డబ్బులు వదులుకుంటున్నారా? ఇలా చేస్తే మీ సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుంది

రైల్లో నీళ్ల బాటిళ్లు ఒక్కోసారి రూ.20కి అమ్ముతారు. చిల్లర లేదని చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు.

ప్రయాణికులకు ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయాలి

రైల్లో అందుబాటులో ఉండే రైల్ నీర్ బాటిల్స్ ధర రూ.15 మాత్రమే. దాని ధరను బాటిల్పై స్పష్టంగా ముద్రిస్తారు.

రైల్లో అందుబాటులో ఉండే రైల్ నీర్ బాటిల్స్ ధర రూ.15 మాత్రమే. దాని ధరను బాటిల్పై స్పష్టంగా ముద్రిస్తారు.

ప్రయాణికులు రైల్ మదద్కు లేదా 139కు కాల్ చేసి కూడా తన ఫిర్యాదులను నమోదు చేయించుకోవచ్చు

నిబంధనల ప్రకారం, రైల్వే స్టేషన్లల్లో ఇతర కంపెనీల నీళ్ల బాటిళ్లు అమ్మడం కూడా నిషిద్ధమే. రైల్వే అనుమతి ఉన్న ఉత్పత్తులనే విక్రయించాలి
Updated at - Jan 24 , 2025 | 04:38 PM