Dusshera Holidays: దసరాల సెలవులు వచ్చేశాయ్.. ఊళ్లకు వెళ్తున్న విద్యార్థులు..
ABN, Publish Date - Sep 20 , 2025 | 06:35 PM
తెలంగాణలో దసరా సెలవులు వచ్చేశాయ్. దీంతో హాస్టళ్లలో ఉండే విద్యార్థులు తమ తమ ఊళ్లకు బయలుదేరుతున్నారు.
1/7
దసరా సెలవు వచ్చేశాయ్. అధికారికంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు స్కూ్ళ్లకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
2/7
21వ తేదీ నుంచి సెలవులు కావడంతో హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, ఇతర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు తమ తమ ప్రాంతాలకు బయలుదేరారు.
3/7
సెలవుల నేపథ్యంలో విద్యార్థులంతా బస్టాండ్లకు క్యూ కట్టారు. దీంతో బస్ స్టేషన్లన్నీ సందడిగా మారాయి.
4/7
వనపర్తి జిల్లా కేంద్రంలో దసరా సెలవులు రావడంతో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు వారి వారి సొంత గ్రామాలకు తరలివెళుతున్నారు.
5/7
విద్యార్థులు తల్లిదండ్రులు బంధుమిత్రులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి సొంత గ్రామాలకు వెళుతున్నారు.
6/7
దసరా సెలవుల నేపథ్యంలో హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులను తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్తున్నారు.
7/7
గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డుపై వాహనాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.
Updated at - Sep 20 , 2025 | 06:35 PM