సమ్మక్క సారక్క దర్శనంకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Dec 07 , 2025 | 03:50 PM
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది.
1/7
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది.
2/7
ఈ మహా జాతర ప్రారంభానికి ముందే భక్తులు భారీగా సమ్మక్క సారలక్క దేవతలను దర్శించుకుని ముక్కులు చెల్లిస్తున్నారు. ఆదివారం మేడారంకు భక్తులు పోటెత్తారు.
3/7
సమ్మక్క సారలమ్మ దేవతలకు భక్తులు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వెళ్లారు.
4/7
ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరిగే మేడారం మహా జాతరలో లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు.
5/7
ఈ సారి గతం కంటే మరింత వైభవంగా జాతర నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అధికారులు తెలిపారు.
6/7
జనవరిలో నిర్వహించే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా నిర్వహించనున్నామని అధికారులు వెల్లడించారు.
7/7
ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది.
Updated at - Dec 07 , 2025 | 03:50 PM