Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి
ABN, Publish Date - Oct 30 , 2025 | 01:53 PM
మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశించారు.
1/14
మొంథా తుపాను ప్రభావంతో మున్నేరుకు పోటెత్తిన వరద.
2/14
మున్నేరుకు 24.5 అడుగుల మేర వర్షపు నీరు చేరింది.
3/14
మున్నేరు పరివాహక ప్రాంతాలైన బొక్కల గడ్డ వెంకటేశ్వరనగర్, మోతీనగర్, ప్రభావతి నగర్లో ఇండ్లు నీట మునిగాయి.
4/14
తుపాను బాధితులకు ఖమ్మం నయా బజార్ కాలేజీలో వసతిని ఏర్పాటు చేశారు.
5/14
మున్నేరుకు వరద ఉధృతి పెరగడంతో పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
6/14
ఖమ్మం కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్తతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు మంత్రి తుమ్మల.
7/14
మున్నేరు పరివాహక ప్రాంతంలో ప్రజలకు ఎక్కడ సౌకర్యం కలగకుండా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
8/14
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8 డివిజన్ల పరిధిలో మున్నేరు ప్రవహిస్తోంది.
9/14
మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించిన అధికారులు.
10/14
మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రంకు తరలించారు.
11/14
వరద ప్రవాహం తగ్గుముఖం పట్టాలని స్థానికుల పూజలు
12/14
వరద నీటిలో చిన్నారుల ఆటలు
13/14
వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన పామును పట్టుకున్న స్థానికుడు
14/14
వరద నీటిలో మునిగిన ఎల్లమ్మ తల్లి దేవాలయం
Updated at - Oct 30 , 2025 | 01:54 PM