CM Revanth Reddy: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Apr 10 , 2025 | 06:02 PM
మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దేశ చరిత్రలో ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ అందులో కొంతమంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని, నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్సారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Updated at - Apr 11 , 2025 | 09:01 AM