భూపాలపల్లి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ABN, Publish Date - Dec 17 , 2025 | 10:25 AM
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది.
1/5
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది.
2/5
ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు.
3/5
మూడవ దశలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
4/5
అందువల్ల 3,752 గ్రామ పంచాయతీలకూ, 28,410 వార్డులకూ పోలింగ్ జరుగుతోంది. భూపాలపల్లి జిల్లాలో ఉదయం నుంచే ప్రజలు క్యూ లైన్లో నిలబడి ఓటు వేస్తున్నారు.
5/5
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తారు.
Updated at - Dec 17 , 2025 | 10:38 AM