మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్..
ABN, Publish Date - Dec 24 , 2025 | 01:09 PM
యాషెస్ సిరీస్2025-26లో భాగంగా రెండు, మూడో టెస్టుల మధ్య నూసాలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు విచ్చలవిడిగా మద్యం తాగారన్న వార్త సంచలనం రేపిన విషయం తెలిసిందే. డకెట్ ఏకంగా మద్యం మత్తులో హోటల్ దారి మర్చిపోయాడనే వీడియో వైరలైంది. ఈ ఘటనపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించింది.
1/6
యాషెస్ సిరీస్2025-26లో భాగంగా రెండు, మూడో టెస్టుల మధ్య నూసాలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు విచ్చలవిడిగా మద్యం తాగారన్న వార్త సంచలనం రేపిన విషయం తెలిసిందే.
2/6
డకెట్ ఏకంగా మద్యం మత్తులో హోటల్ దారి మర్చిపోయాడనే వీడియో వైరలైంది. ఈ ఘటనపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించింది.
3/6
తమపై వచ్చిన ఆరోపణలపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని స్టోక్స్ కొట్టి పారేశాడు.
4/6
‘ఈ సమయంలో నేను ఎలా వ్యవహరిస్తున్నాను అనేదే నాకు అత్యంత కీలకం. కెప్టెన్గా నా ఆటగాళ్లను సాధ్యమైనంత వరకు రక్షించడం నా ప్రధాన కర్తవ్యం’ అని స్టోక్స్ వెల్లడించాడు.
5/6
‘యాషెస్ సిరీస్ను ఇంకా రెండు మ్యాచులు ఉండగానే కోల్పోయాం. ఇలాంటి సమయంలో మా జట్టు ఆటగాళ్లను చూసుకోవడం నా బాధ్యత.
6/6
అందుకే నేను ఎప్పుడూ నా ఆటగాళ్ల వెనక నిలబడతాను’ అని మద్యం మత్తులో ఉన్న ఆటగాళ్ల విషయంపై పరోక్షంగా స్పందిస్తూనే ఆ విషయాన్ని స్టోక్స్ కొట్టిపారేశాడు.
Updated at - Dec 24 , 2025 | 01:09 PM