JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు
ABN, Publish Date - Mar 15 , 2025 | 07:59 AM
జనప్రవాహంతో జనసేన సభ పోటెత్తింది. 12వ ఆవిర్భావ సభ వేళ పిఠాపురం ‘జయ కేతనం’ ఎగురవేసింది. తండోపతండాలుగా వచ్చిన జనంతో చిత్రాడలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం కిక్కిరిసింది.
1/11
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది.
2/11
లక్షలాది మంది జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున చిత్రాడ సభకు తరలి వచ్చారు.
3/11
ఒక్కో గ్యాలరీలో 2,500 మంది కూర్చొనేలా పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. గ్యాలరీలన్నీ జనసైనికులతో నిండిపోయాయి.
4/11
ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు, చిన్నారులు పెద్దఎత్తున సభకు తరలి వచ్చారు.
5/11
సభకు వచ్చిన జనసేన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ వర్గాలు పూర్తి ఏర్పాట్లు చేశాయి.
6/11
సభకు తరలి వచ్చిన జనసేన కార్యకర్తలకు ఇబ్బంది రానీయకుండా పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు.
7/11
సభలో సందడి చేస్తున్న జనసైనికులు
8/11
పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా ఆసక్తిగా వింటున్న యువత
9/11
పవన్ కల్యాణ్కు హారతి ఇస్తున్న వీరాభిమాని
10/11
పవన్ కల్యాణ్ కటౌట్లతో సందడి చేస్తున్న యువకులు
11/11
పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా టపాసులు కాలుస్తున్న జనసైనికులు
Updated at - Mar 15 , 2025 | 12:05 PM