Journalism: జర్నలిస్టులకు దేశమంతటా ఒకే పెన్షన్ ఉండాలి
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:22 AM
రిటైర్డు జర్నలిస్టులకు దేశమంతటా ఒకే పెన్షన్ విధానం ఉండాలని సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్..
సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీర్మానం
బెంగళూరు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రిటైర్డు జర్నలిస్టులకు దేశమంతటా ఒకే పెన్షన్ విధానం ఉండాలని సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది. కేరళలో ఇటీవల జరిగిన ఫెడరేషన్ తొలి సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా ఢిల్లీకి చెందిన సందీప్ దీక్షిత్ ఎంపికయ్యారు. నేషనల్ కౌన్సిల్ మెంబర్గా తెలుగు పత్రికలలో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ రజాక్ ఎంపికయ్యారు. కర్ణాటక నుంచి కార్యదర్శిగా కె. శాంత కుమారి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరుగా ఆర్పీ సాంబశివారెడ్డి, నేషనల్ కౌన్సిల్ మెంబర్లుగా రుద్రప్ప అసంగి, పండిత్ నాటికర్, జాకీర్ హుసేన్ ఎంపికయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..