Share News

Supreme Court judgment: న్యాయాధికారి పోస్టులకు మూడేళ్ల లా ప్రాక్టీసు తప్పనిసరి

ABN , Publish Date - May 21 , 2025 | 03:36 AM

మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌గా చేరాలంటే కనీసం 3 ఏళ్లు న్యాయవాదిగా పని చేసిన అనుభవం ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రాక్టీసు లేకుండానే నేరుగా పదవులు చేపట్టే అవకాశాన్ని తొలగిస్తూ 2002 ఉత్తర్వులను రద్దు చేసింది.

Supreme Court judgment: న్యాయాధికారి పోస్టులకు మూడేళ్ల లా ప్రాక్టీసు తప్పనిసరి

న్యూఢిల్లీ, మే 20: న్యాయాధికారిగా పదవులు చేపట్టాలంటే తొలుత న్యాయవాదిగా పనిచేసిన అనుభవం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జ్యుడీషియల్‌ సర్వీసె్‌సలో ప్రారంభ పదవి అని మున్సిఫ్‌ మేజిస్ట్రేటుగా చేరాలంటే లాయర్‌గా కనీసం మూడేళ్లు ప్రాక్టీసు చేసి ఉండాలని తెలిపింది. న్యాయ కళాశాలల నుంచి పట్టాలు పొందిన వారు ఎలాంటి ప్రాక్టీసు లేకుండానే నేరుగా మున్సిఫ్‌ మేజిస్ట్రేటు పదవులు చేపట్టవచ్చంటూ 2002లో ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టింది. ఈ మేరకు ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. ఈ మేరకు నిబంధనలను సవరించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 03:36 AM