ఈ ఘనత చంద్రబాబుదే
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:56 AM
గత ఆరు నెలలుగా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఎప్పుడు కలిసినా విశాఖ ఉక్కుకు న్యాయం చేయాలని కోరారని, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఆర్థిక ప్యాకేజీ సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు: రామ్మోహన్ నాయుడు
ప్రజల్లో అసంతృప్తి తొలగిపోయింది: శ్రీనివాస వర్మ
న్యూఢిల్లీ, విశాఖపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): గత ఆరు నెలలుగా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఎప్పుడు కలిసినా విశాఖ ఉక్కుకు న్యాయం చేయాలని కోరారని, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఆర్థిక ప్యాకేజీ సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంరఽధుల హక్కు అన్న సత్యాన్ని గుర్తించి ఉదారంగా వ్యవహరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఉక్కు మంత్రి కుమారస్వామి ప్లాంట్ను సందర్శించి కార్మికులు, అధికారులతో చర్చించారని తెలిపారు. ఏపీకి ప్రాతినిఽధ్యం వహిస్తున్న మంత్రి మాదిరే కుమారస్వామి పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. గత పదేళ్లుగా ఉత్తరాంధ్ర ఎంపీగా స్టీల్ ప్లాంట్ సమస్యలను తాను పార్లమెంట్లో లేవనెత్తానని చెప్పారు. కాగా, ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకున్న ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్, ఉక్కు మంత్రి కుమారస్వామితోపాటు సీఎం చంద్రబాబు కృషి వల్ల ఈ నిధులు మంజూరయ్యాయని సహాయమంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో స్టీల్ప్లాంట్కు పూర్వవైభవం వస్తుందని ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు.