Punjab Police Operation: పంజాబ్లో ఖలిస్తానీ ఉగ్రవాదుల ముఠా అరెస్ట్
ABN , Publish Date - May 21 , 2025 | 07:55 AM
పంజాబ్లో ఖలిస్తానీ ఉగ్రవాదుల ముఠా అరెస్ట్. ఈ ఆపరేషన్లో ఆరుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు, వీరంతా పాకిస్థాన్ ఐఎ్సఐ మద్దతుతో పనిచేస్తున్నట్లు తేలింది.
ఛండీగఢ్, మే 20: పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తోన్న నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ టెర్రర్ (బీకేఐ) ఉగ్రవాదుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వీరంతా ఖలిస్తానీ తీవ్రవాదులని తమ విచారణలో తేలిందని పంజాబ్ డీజీపీ గౌరవ్ తెలిపారు. రెండు రోజుల క్రితం బటాలాలోని ఓ మద్యం దుకాణంపై జరిగిన గ్రెనేడ్ దాడి కూడా వీరి పనేనని ఆయన తెలిపారు. అరెస్టయిన వారు పోర్చుగల్ లో నివసించే విదేశీ హ్యాండర్ల ఆదేశాలతో పనిచేస్తున్నారని అన్నారు.