PSU employees: తొలగించిన పీఎస్ యూ ఉద్యోగులకు
ABN , Publish Date - May 28 , 2025 | 06:49 AM
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో (PSUs) దుష్ప్రవర్తన కారణంగా బర్తరప్ లేదా తొలగింపులకు గురైన ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్లు కోల్పోతారు. 2025 నాటికి కొత్త సర్వీసు నిబంధనలు ఈ మార్పును అధికారికంగా ప్రకటించాయి.
రిటైర్మెంట్ బెనిఫిట్లు వర్తించవన్న కేంద్రం
న్యూఢిల్లీ, మే 27: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(పీఎ్సయూ)ల్లో బర్తరప్/ తొలగింపునకు గురైన ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్లు కోల్పోనున్నారని కేంద్రం మంగళవారం తెలిపింది. విధి నిర్వహణలో దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు రుజువైన పీఎ్సయూ ఉద్యోగులను సర్వీసుల నుంచి తొలగిస్తే, వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు లభించవు. ఈ మేరకు 2021 నాటి సర్వీసు నిబంధనల్లో కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక మార్పులు చేస్తూ ‘కేంద్ర సివిల్ సర్వీసుల్లో (పెన్షన్) సవరించిన నిబంధనలు - 2025’ ఈ నెల 22న నోటిఫై చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News