PM Review on Economic Reforms: ఆర్థిక సంస్కరణలపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
ABN , Publish Date - Aug 19 , 2025 | 02:44 AM
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించిన తదుపరి తరం ఆర్థిక సంస్కరణల అమలుపై ...
న్యూఢిల్లీ, ఆగస్టు 18: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించిన తదుపరి తరం ఆర్థిక సంస్కరణల అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, శివరాజ్సింగ్ చౌహాన్, పీయూష్ గోయల్, లలన్ సింగ్, కార్యదర్శులు, ఆర్థికశాస్త్రవేత్తలు పాల్గొన్నారు. జీఎస్టీలో సంస్కరణలు, సెమీ కండక్టర్, ఎరువుల రంగాల్లో స్వావలంబ సాధన, సులభతర జీవనం, వాణిజ్యం తదితర అంశాలపై మార్గసూచీని రూపొందించే దిశగా చర్చలు సాగాయి.