Share News

Pakistan Army: పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు ఫీల్డ్‌ మార్షల్‌ ర్యాంక్‌

ABN , Publish Date - May 21 , 2025 | 03:48 AM

భారత్‌తో యుద్ధ వాతావరణంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిం మునీర్‌ను అద్భుత పనితీరుకు ఫీల్డ్‌ మార్షల్‌ ర్యాంకుతో పదోన్నతిని కల్పించారు. ప్రధాని షెహబాజ్‌ నేతృత్వంలోని క్యాబినెట్‌ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.

Pakistan Army: పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు ఫీల్డ్‌ మార్షల్‌ ర్యాంక్‌

భారత్‌తో పోరు నేపథ్యంలో పదోన్నతి

న్యూఢిల్లీ, మే 20: భారత్‌తో పోరులో ‘అద్భుత పనితీరు’ కనబర్చారంటూ పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిం మునీర్‌కు పాక్‌ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది!! భారత్‌తో యుద్ధవాతావరణ నెలకొన్న సమయంలో ఎవరికీ కనిపించకుండా పోయిన మునీర్‌కు అత్యున్నతమైన ‘ఫీల్డ్‌ మార్షల్‌’ ర్యాంకును పాక్‌ సర్కారు కట్టబెట్టింది! ప్రధాని షెహబాజ్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశం మునీర్‌కు పదోన్నతి ఇవ్వడానికి ఆమోదించిందంటూ పాక్‌ పీఎంవో ఓ ప్రకటనలో తెలిపినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ మంగళవారం వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 03:51 PM